ఇండిపెండెంట్ డైరెక్టర్

డాక్టర్ (శ్రీమతి) సునీతా మహేశ్వరి

డాక్టర్ (శ్రీమతి) సునీతా మహేశ్వరి, వయస్సు యాభై తొమ్మిది (59) సంవత్సరాలు, ముప్పై (30) సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు మరియు US & ఇండియాలో నివసించారు మరియు పని చేశారు. ఆమె ఒక US బోర్డ్ సర్టిఫైడ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో తన MBBS ని పూర్తి చేసారు, ఆ తర్వాత AIIMS, ఢిల్లీ మరియు US లోని యేల్ యూనివర్సిటీ నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఒక చికిత్స నిపుణురాలిగా ఉండటంతో పాటు, డాక్టర్ (శ్రీమతి) మహేశ్వరి Telerad గ్రూపులో ఒక వైద్య పారిశ్రామికవేత్త మరియు సహ-వ్యవస్థాపకురాలుగా ఉన్నారు, ఈ గ్రూపులో ఇవి ఉంటాయి:  

(a) A-Kal టెలివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతదేశం యొక్క మొదటి మరియు అతిపెద్ద టెలరాడియాలజీ కంపెనీ, ఇది ప్రపంచవ్యాప్తంగా రోగులు మరియు ఆసుపత్రులకు 8 మిలియన్లకు పైగా డయాగ్నోస్టిక్ నివేదికలను అందించింది),  

(b) ఎఐ ఎనేబుల్డ్ టెలి హెల్త్ సాఫ్ట్‌వేర్‌ను నిర్మించే టెలరాడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్; మరియు  

(c) RXDX Healthcare - బెంగుళూరు మరియు గ్రామీణ భారతదేశంలో మల్టీ-స్పెషాలిటీ నైబర్‌హుడ్ ఫిజిటల్ క్లినిక్‌ల చైన్ 

(d) డైగ్నోస్టిక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో ఏవియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలువబడేది)  

డాక్టర్. (శ్రీమతి.) మహేశ్వరి టెలిహెల్త్ రంగంలో హెల్తీ మైండ్స్ - టెలి-కౌన్సెలింగ్ ప్లాట్‌ఫారం వంటి ఇతర స్టార్ట్-అప్ కంపెనీలకు కూడా మద్దత్తు అందించారు. ఆమె భారతదేశంలో సోషల్ కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారు, ఇక్కడ ఆమె 2 ట్రస్ట్ నిధులను నిర్వహిస్తున్నారు. 'People4people' ప్రభుత్వ పాఠశాలల్లో 650 కంటే ఎక్కువ ఆట స్థలాలను ఏర్పాటు చేసింది మరియు ఆసియాలో అధిక నాణ్యతగల వైద్య సంరక్షణకు యాక్సెస్ లేని ప్రాంతాలలో Telerad Foundation టెలిరేడియాలజీ మరియు టెలిమెడిసిన్ సేవలను అందిస్తుంది. ఆమె బోధన పట్ల కుడా ఆసక్తి కలిగి ఉన్నారు. డాక్టర్. (శ్రీమతి.) మహేశ్వరి పీడియాట్రిక్ కార్డియాలజీలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ల కోసం భారతదేశం యొక్క ఇ-టీచింగ్ ప్రోగ్రామ్‌ను దశాబ్ద కాలం నుండి నిర్వహిస్తున్నారు. ఆమె యేల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ గ్లోబల్ హెల్త్ యొక్క సుస్థిరమైన ఆరోగ్య కార్యక్రమం కొరకు రెసిడెంట్ మెంటర్‌గా వ్యవహరించారు, ఇక్కడ ఆమె తన జీవిత భాగస్వామితో కలిసి గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ కోసం కళ్యాణ్‌పూర్-మహేశ్వరి ఎండోమెంట్‌ను స్థాపించారు. ఆమె ప్రస్తుతం పీడియాట్రిక్ కార్డియాక్ సొసైటీ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్.  

డాక్టర్ (శ్రీమతి) మహేశ్వరి తన పేరు మీద 200 కంటే ఎక్కువ విద్యా ప్రెజెంటేషన్లు మరియు ప్రచురణలను కలిగి ఉన్నారు మరియు అనేక TEDx ప్రసంగాలతో సహా 200 కంటే ఎక్కువ ఉపన్యాసాలను ఇచ్చిన స్ఫూర్తిదాయక స్పీకర్. డాక్టర్. (శ్రీమతి.) మహేశ్వరి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు వాటిలో: ET ఇండియన్ కార్డియాక్ కేర్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2024 వద్ద Trailblazing Indian Cardiac leader, Business world యొక్క 20 most influential women in healthcare 2022, WOW (Woman of Worth) 2019 అవార్డు, Amazing Indian అవార్డు - Times Now 2014; భారతదేశంలో Top 20 women Health care achievers, Modern Medicare 2009; Yale University- Outstanding Fellow Teacher of the Year అవార్డు, 1995, ఉన్నాయి. 

డాక్టర్ (శ్రీమతి) మహేశ్వరి A-KAL Televerse Private Limited, GlaxoSmithKline Pharmaceuticals Limited, Telerad Tech Private Limited, Image Core Lab Private Limited, Healtheminds Solutions Private Limited మరియు Telerad Rx Dx Healthcare Private Limited బోర్డులో డైరెక్టర్.